News May 20, 2024
18 లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లు రద్దు!

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఒకేసారి 18లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే డివైజ్ నుంచి వేలల్లో సిమ్ కనెక్షన్లను వినియోగించిన సందర్భాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల 28,220 ఫోన్లను బ్లాక్ చేయమని టెలికాం సంస్థలను కేంద్రం ఆదేశించింది. కాగా ఏడాదిలో 1.70కోట్ల కనెక్షన్లను కేంద్రం తొలగించింది.
Similar News
News November 14, 2025
కమలం జోరు.. కాంగ్రెస్ బేజారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP దూసుకెళ్తోంది. JDUతో కలిసి బరిలోకి దిగిన కాషాయ పార్టీ 95 సీట్లలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2020 ఎన్నికల్లో ఆ పార్టీ 74 స్థానాలు గెలవగా ఇప్పుడు ఆ సంఖ్యను భారీగా పెంచుకుంటోంది. అటు ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ బోల్తా పడింది. కేవలం 3 చోట్లే ఆధిక్యంలో ఉంది. గత ఎలక్షన్స్లో హస్తం పార్టీ 19 సీట్లు గెలవగా ఇప్పుడు మరింత దిగజారింది.
News November 14, 2025
చనిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ అన్వర్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తయిన కౌంటింగ్లో ఆయనకు 24 ఓట్లు వచ్చాయి. 924 ఓట్లతో NOTA 4వ స్థానంలో నిలిచింది. అటు ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్కు అత్యల్పంగా 9 ఓట్లు పడ్డాయి. కాగా ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.
News November 14, 2025
చిరాగ్ పాస్వాన్: పడి లేచిన కెరటం!

సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు LJP అధినేత చిరాగ్ పాస్వాన్. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130కి పైగా సీట్లలో పోటీ చేసి కేవలం ఒకేఒక స్థానంలో గెలిచారు. బాబాయ్తో వివాదాలు, 2021లో పార్టీలో చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో NDAతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 5 చోట్లా గెలిచి పట్టు నిలుపుకున్నారు. తాజాగా 29 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల లీడింగ్లో ఉన్నారు.


