News September 10, 2024
‘క్యాన్సర్ భయం’ గుప్పిట్లో 60శాతానికి పైగా భారతీయులు

భారత్లో 60శాతానికి పైగా ప్రజలు క్యాన్సర్పై భయంతో బతుకుతున్నారని GOQii నిర్వహించిన సర్వేలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. తమకెక్కడ క్యాన్సర్ వస్తుందోనన్న టెన్షన్ 60శాతం భారతీయుల్లో కనిపిస్తోంది. చికిత్స ఉండదేమోనన్న ఆందోళన, మరణం-ఆర్థిక కష్టాల భయాలు వారిని వెంటాడుతున్నాయి. క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు దానిపై ఉన్న భయాందోళనల్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని నివేదిక అభిప్రాయపడింది.
Similar News
News November 25, 2025
భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.
News November 25, 2025
CSIR-NEERIలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) 14 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 23వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.Tech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://neeri.res.in
News November 25, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.


