News April 7, 2025
రాష్ట్రంలో వెయ్యికి పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్

TG: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు ఊపందుకోవడంతో వెయ్యికి పైగా కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. రానున్న రోజుల్లో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో మొత్తం 8వేల సెంటర్లను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా 90 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Similar News
News December 23, 2025
క్యాబినెట్ భేటీ వాయిదా

AP: ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. 29వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజు సీఎం అధ్యక్షతన 10.30amకు సచివాలయం మొదటి బ్లాకులో భేటీ జరగనుంది. మరోవైపు ఈ నెల 28న CM చంద్రబాబు అయోధ్య వెళ్లనున్నారు. 11.20amకు రామజన్మభూమి కాంప్లెక్స్కు చేరుకొని 2.30pm వరకు శ్రీరాముడిని దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లిలోని నివాసానికి తిరుగుపయనమవుతారు.
News December 23, 2025
పూజల్లో ‘వక్క’ సమర్పిస్తున్నారా?

‘వక్క’ అత్యంత పవిత్రమైనది. పూజలో దీనిని అఖండంగా(ముక్కలు చేయకుండా) ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. తద్వారా పూర్తి ఫలితం లభిస్తుందంటున్నారు. ‘దీన్ని దేవతలకు ప్రతీకగా భావిస్తారు. ఇది దైవంతో మనకున్న బలమైన బంధానికి, విధేయతకు చిహ్నం. ఆయుర్వేద పరంగానూ ఇది చాలా ఉపయోగకరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలి పెంచుతుంది. యజ్ఞాల్లో తమలపాకుతో కలిపి వక్క సమర్పిస్తే కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.
News December 23, 2025
నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ 4pmకు పులివెందుల చేరుకొని భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 24న ఉదయం ఇడుపులపాయకు వెళ్లి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 1pmకు మళ్లీ పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 25న 8.30amకు CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు. 10.30amకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.


