News July 3, 2024
హాథ్రస్ ఘటన కేసులో మరిన్ని విషయాలు!
UPలోని హాథ్రస్లో జరిగిన విషాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్య నిర్వాహకుడు దేవప్రకాశ్తో పాటు మరికొందరిపై BNSలోని హత్యానేరం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భోలే బాబాను అరెస్ట్ చేసే అంశంపై ఆ రాష్ట్ర DGP ప్రశాంత్ కుమార్ స్పందించారు. దర్యాప్తులో ఉన్న సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 2 లక్షల మందికి బందోబస్తుగా 40+ మంది పోలీసులే విధుల్లో ఉన్నారట.
Similar News
News October 13, 2024
కేజీ చికెన్ ధర ఎంతంటే?
సాధారణంగా దసరా రోజు తెలంగాణలో నాన్వెజ్ వంటకాలే చేస్తారు. అయితే నిన్న శనివారం కావడంతో ఎక్కువశాతం మంది వెజ్కే పరిమితమయ్యారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్, మటన్ కోసం మార్కెట్లకు క్యూ కడుతున్నారు. దీంతో HYDతో పాటు APలోని విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. అయితే 2 రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్లెస్ కేజీ రూ.240-260 మధ్య పలుకుతోంది.
News October 13, 2024
టీతోపాటు సిగరెట్ తాగుతున్నారా?
చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. కానీ దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్లో క్యాన్సర్, నపుంసకత్వం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో జీర్ణ కణాలనూ దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్తి, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే డాక్టర్ను సంప్రదించాలి.
News October 13, 2024
వీరిలో పర్మినెంట్ వికెట్ కీపర్ ఎవరో?
ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. టీ20ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. నిన్న బంగ్లాతో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో శాంసన్ ఈ రేసులో మరింత ముందుకు దూసుకొచ్చారు. ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి.