News March 21, 2024

ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి ఎక్కువ ఫండ్స్ ఈ పార్టీలకే!

image

అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రై.లి. ఏ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో వెల్లడైంది. 2020 నుంచి 2024 వరకు ఈ సంస్థ రూ.1,368 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అందులో TMCకి రూ.542 కోట్లు, DMKకు రూ.503 కోట్లు, YSRCPకి రూ.154 కోట్లు, BJPకి రూ.100 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.50 కోట్లు అందాయి. భారత లాటరీ పరిశ్రమలో ఈ సంస్థ టర్నోవర్ రూ.1.65 లక్షల కోట్లు.

Similar News

News April 8, 2025

రాష్ట్రంలో బార్స్, వైన్స్ మధ్య రగడ

image

TG: రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండటం వల్ల తాము నష్టపోతున్నామని, 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూములనూ మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ వల్లే ప్రభుత్వానికి 85% ఆదాయం వస్తోందని, బార్ల వల్ల 15% మాత్రమే ఆదాయం వస్తోందని వైన్స్ అసోసియేషన్ నాయకులు వాదిస్తున్నారు.

News April 8, 2025

APలో ఇకనుంచి ఒకటే గ్రామీణ బ్యాంకు

image

APలో ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒక్కటే ప్రజలకు సేవలందించనుంది. AP చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇందులో విలీనం కానున్నాయి. RBI ప్రణాళిక ప్రకారం 43 గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించనున్నారు. ఈ బ్యాంకు ప్రధాన కేంద్రం అమరావతి కాగా, మే1 నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది.

News April 8, 2025

అదనపు టీచర్ పోస్టులపై CBI విచారణ అనవసరం: సుప్రీం

image

బెంగాల్ టీచర్ నోటిఫికేషన్‌లోని అదనపు పోస్టుల విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 2016లో విడుదలైన నోటిఫికేషన్‌లో 6,861 అదనపు టీచర్ పోస్టుల అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మమతా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ తీర్పును రద్దుచేసింది.

error: Content is protected !!