News August 18, 2024
దేశంలో రూ.20వేల లోపు జీతగాళ్లే అధికం

ఆఫీసేతర(బ్లూకాలర్) కంపెనీల యజమానులు తమ సిబ్బందికి నెలకు ₹20వేల కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారని వర్క్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ కేటగిరీలో 57.63% మంది ఉన్నారంది. దీంతో ఆర్థిక కష్టాలతో గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అవసరాల కోసం వారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. ₹20-40వేల శాలరీ 29.34% మంది, ₹40-60వేల జీతం 10.71% మంది, ₹60వేల పైన శాలరీ 2.31% మంది పొందుతున్నారని తెలిపింది.
Similar News
News January 7, 2026
LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.
News January 7, 2026
ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం!

TG: రాష్ట్ర సాధన కోసం KCR స్థాపించిన TRSలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కవితకు ఆ పార్టీతో పూర్తిగా బంధం తెగిపోయింది. ఆమె MLC పదవి రాజీనామాకు మండలి ఛైర్మన్ <<18784326>>ఆమోదం<<>> తెలిపారు. తండ్రితో కలిసి ఉద్యమంలో పాల్గొన్న కవిత ఆ పార్టీపైనే ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడింది. పార్టీ తనను ఘోరంగా అవమానించిందంటూ ఇటీవల అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు.
News January 7, 2026
US గుప్పిట్లోకి వెనిజులా సంపద.. 5 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ హస్తగతం!

వెనిజులాలో మదురో ప్రభుత్వ పతనం తర్వాత అక్కడి వనరులపై అమెరికా పట్టు సాధించే దిశగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం తమకు 3-5 కోట్ల బ్యారెళ్ల చమురును అప్పగించబోతోందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని మార్కెట్ ధరకే విక్రయించి.. వచ్చే నిధులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. వాటిని వెనిజులా, అమెరికా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని తెలిపారు.


