News August 28, 2025
డేటింగ్ యాప్స్లో మహిళా యూజర్లే ఎక్కువ!

సాధారణంగా డేటింగ్ యాప్స్లో పురుషులే ఎక్కువగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇండియాలోని డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్స్, యాప్స్లో ఫీమేల్ యూజర్లే ఎక్కువ ఉన్నారని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్లో 57% మంది సబ్స్క్రైబర్లు మహిళలే అని చెప్పారు. 6 నెలలకు సబ్స్క్రిప్షన్ ఫీ రూ.57,459 ఉన్నప్పటికీ వారు వెనుకాడటం లేదని పేర్కొన్నారు.
Similar News
News August 28, 2025
2038 నాటికి రెండో అతిపెద్ద ఎకానమీగా భారత్!

భారత్ పర్చేసింగ్ పవర్ పారిటీ(PPP) టర్మ్స్ పరంగా 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదగొచ్చని EY రిపోర్ట్ అంచనా వేసింది. $34.2 ట్రిలియన్ల GDP నమోదు చేయొచ్చని పేర్కొంది. దేశ జనాభా సగటు వయసు 28.8 ఏళ్లు, రెండో అత్యధిక సేవింగ్స్ రేట్, ప్రభుత్వ అప్పులు-GDP రేషియో తగ్గుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. చైనా 2030కి $42.2 ట్రిలియన్లతో లీడింగ్లో ఉన్నా వృద్ధ జనాభా దానికి అడ్డంకి అవుతుందంది.
News August 28, 2025
ఈ ప్రత్యేకమైన గణనాథుడి గురించి తెలుసా?

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన సత్య గణేశుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజులు ఉత్సవాలు చేస్తారు. చివరి రోజు ఊరేగించి, నీళ్లు చల్లి ఆలయంలోని గదిలో భద్రపరుస్తారు. 1948లో పాలజ్లో కలరా, ప్లేగు వ్యాధులతో చాలా మంది చనిపోవడంతో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
News August 28, 2025
సెలవుపై ముందే నిర్ణయం తీసుకోవచ్చుగా.. నెటిజన్ల సూచన

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పదికి పైగా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాల్లో లేటుగా తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల స్కూళ్లకు పిల్లలు, టీచర్లు చేరుకున్నాక సెలవు ప్రకటించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుని ముందు రోజే సెలవుపై నిర్ణయం తీసుకోవడం అంత కష్టమా అంటున్నారు. దీనిపై మీ కామెంట్?