News October 7, 2025

Most Prestigious.. జూబ్లీహిల్స్ బైపోల్

image

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో HYD జూబ్లీహిల్స్ బైపోల్ అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ తర్వాత వచ్చే అన్ని ఎలక్షన్లలో ఇక ఆ పార్టీదే హవా ఉంటుందనే చర్చ స్థానికంగా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే BRS అభ్యర్థిగా మాగంటి సునీతను KCR ప్రకటించగా కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, BJP నుంచి ముగ్గురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రేపటిలోపు అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Similar News

News March 27, 2026

గుంటూరులో ఉచిత వృత్తి విద్యా శిక్షణ

image

గుంటూరు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నారు. శిక్షణ తీసుకునే వారికి భోజనం, హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం. కోర్సు పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ఉచితంగా టూల్ కిట్ కూడా అందజేస్తారు. ఆసక్తి గల వారు సంబంధిత ఆన్‌లైన్ లింక్ ద్వారా తమకు నచ్చిన కోర్సుకు రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

News March 27, 2026

ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

image

ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇరానీయన్లు చర్చల్లో మేటి అని ట్రంప్ కొనియాడారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం రిలీఫ్‌నిచ్చింది.

News March 27, 2026

నేటి నుంచి విజయవాడలో ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెుల 27, 28, 29న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28న సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కుల గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.