News March 30, 2025
నీటిలో మునిగి ముగ్గురు పిల్లలతో సహా తల్లి మృతి

TG: ఉగాది పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. కామారెడ్డి (D) ఎల్లారెడ్డి (M) వెంకటాపూర్లో చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. చెరువులో స్నానానికి దిగి మునిగిపోతున్న ముగ్గురు పిల్లలను కాపాడేందుకు యత్నించిన తల్లి వారితో పాటు మునిగి చనిపోయారు. మృతులను మౌనిక(26), మైథిలి(10), అక్షర (8), వినయ్(5)గా గుర్తించారు. పండుగ పూట నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 20, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 20, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 20, 2026
రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంపిటేటివ్ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను రెండేళ్ల క్రితమే ఆడటం ఆపేశాను. నా ఇష్టంతోనే ఈ ఆటలోకి వచ్చాను. ఇష్టపూర్వకంగానే తప్పుకున్నాను. దీనిని ప్రత్యేకంగా అనౌన్స్ చేయాల్సిన అవసరంలేదు’ అని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. వరల్డ్ మాజీ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సైనా నెహ్వాల్ ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ సహా మొత్తం 24 అంతర్జాతీయ పతకాలను సాధించారు.


