News April 18, 2025

పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య.. కారణమిదేనా?

image

TG: నిన్న మేడ్చల్ (D) గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆశిష్(7), హర్షిత్(4)కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి. దీంతో తేజస్విని మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ‘మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది. భర్త కోపంతో కసురుకుంటాడు’ అని సూసైడ్ నోట్ రాసింది.

Similar News

News November 21, 2025

వైష్ణవ క్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక సర్వీసులు

image

మార్గశిర, ధనుర్మాసం పుణ్యదినాలు పురస్కరించుకుని ప్రయాణికులు సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన ద్వారకాతిరుమల, వాడపల్లి, అంతర్వేది, అప్పన్నపల్లి, అన్నవరం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.

News November 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

image

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 21, 2025

పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

image

AP: టెన్త్ <>ఎగ్జామ్ షెడ్యూల్<<>> విడుదలైంది. 2026 MAR 16 నుంచి APR 1 వరకు జరగనున్నాయి. MAR 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లిష్, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 1న SSC ఒకేషనల్ కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ఉ.9.30 గంటల నుంచి మ.12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.