News December 31, 2024
మాతృభాష నేర్చుకోవాలి.. కానీ అందులోనే బోధన సరికాదు: మురళి

TG: అందరూ మాతృభాష నేర్చుకోవాలని, కానీ అందులోనే బోధన ఉండాలనేది కరెక్ట్ కాదని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు ఏటా ఫీజు పెంచుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఓ స్కూల్ అప్లికేషన్ ఫీజు ₹4,500 ఉందని ఫైరయ్యారు. ఫీజుల నియంత్రణపై చట్టం తీసుకొచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారాలతో కూడిన ఓ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు.
Similar News
News March 2, 2026
తెలుగు సినిమాకి తెలుగులో టైటిల్ ఏది?

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య నటిస్తున్న సినిమాకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లపై విమర్శలొస్తున్నాయి. మూవీ టీమ్ తమిళం, ఇంగ్లిష్లోనే పోస్టర్లు రిలీజ్ చేసింది. తెలుగులో టైటిల్ పోస్టర్ ఇవ్వలేదు. దీంతో తెలుగు టైటిల్ ఎందుకు లేదు? తెలుగంటే నిర్లక్ష్యం ఎందుకు? అంటూ తెలుగు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News March 2, 2026
22,195 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News March 2, 2026
ఇరాన్లో ఎంత మంది చనిపోయారంటే..

మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం మారణహోమమే సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు 555 మంది మరణించినట్లు ఆ దేశంలోని రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రకటించింది. మొత్తం 131 నివాసాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. గాయపడిన వారి వివరాలను మాత్రం చెప్పలేదు. శనివారం ప్రకటించిన సమాచారం ప్రకారం.. 201 మంది చనిపోగా, 747 మంది గాయపడ్డారు.


