News March 19, 2025

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో కదలిక

image

AP: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ(Comprehensive Mobility Plan) కోసం కేంద్ర ప్రభుత్వం AP మెట్రో రైల్ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేసింది. ఈ మెట్రో ప్రాజెక్టుల మొబిలిటీ ప్లాన్ గడువు ముగిసింది. దీంతో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం కోరింది. కేంద్రం సూచనలతో విశాఖలో రూ.84.47లక్షలు, విజయవాడలో రూ.81.68లక్షలతో సిస్ట్ర MVA సంస్థ ప్లాన్ రూపొందించనుంది.

Similar News

News November 21, 2025

ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

image

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్‌కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.

News November 21, 2025

మహిషి కన్నీరు కలిసిన జలం

image

శబరిమల యాత్రలో ముఖ్య ప్రాంతాల్లో ‘అళుదా నది’ ఒకటి. మహిషిని అయ్యప్ప స్వామి వధించిన స్థలం ఇదేనని ప్రతీతి. స్వామి బాణాలకు తాళలేక మహిషి రోదిస్తూ కన్నుమూశాడు. అప్పుడు కార్చిన కన్నీరు ఈ నదిలో కలిసిందట. అందుకే దీన్ని అళుదా(రోదించడం) నది అని అంటారు. అయ్యప్ప భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, 2 రాళ్లను తీసుకొని, యాత్ర మార్గంలోని కల్లిడుకుండ్రుం వద్ద విసిరి తమ యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 21, 2025

యూనస్ టచ్ కూడా చేయలేడు: షేక్ హసీనా కొడుకు

image

బంగ్లాదేశ్‌లో రాజ్యాంగవిరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ అన్నారు. ‘యూనస్ నా తల్లిని చంపలేరు. కనీసం టచ్ కూడా చేయలేరు. బంగ్లాలో చట్టబద్ధమైన పాలన వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది’ అని చెప్పారు. 140 రోజుల్లోనే విచారణ పూర్తి చేశారని, న్యాయ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. హసీనాకు <<18311087>>మరణశిక్ష <<>>విధిస్తూ ICT తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.