News July 1, 2024
MP లావు కృష్ణ దేవరాయలు నేటి పర్యటన వివరాలు

నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు MP లావు అందుబాటులో ఉండరని పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ గమనించవలసిందిగా తెలిపారు.
Similar News
News October 26, 2025
తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
News October 26, 2025
గుంటూరులో ప్రమాదం.. తెగిపడిన కాలు..!

పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో ప్రమాదం జరిగింది. కొరిటెపాడు ప్రాంతానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్కి తీవ్రగాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
GNT: గుమ్మడి సాగుతో అధిక దిగుబడి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంతర పంటల సాగుతో రైతులు అధిక లాభాలు అర్జిస్తున్నారు. ప్రధాన పంటలో గుమ్మడి కాయ ఒకటి. ఎకరాకు రూ.11 వేల వరకు పెట్టుబడితో 90 నుంచి 120 రోజుల్లో.. ఎకరాకు 4 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, రూ. 50 నుంచి 80వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. జూన్-జులై, డిసెంబర్-జనవరి నెలలు సాగుకు అనువైన సమయం.
#నేడు జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం


