News December 20, 2024

కరెంటు దొంగిలించిన ఎంపీ.. ₹2 కోట్ల ఫైన్

image

SP నేత, సంభల్ MP జియా ఉర్ బర్ఖ్‌కు UP ప్రభుత్వం ₹2 కోట్ల ఫైన్ విధించింది. ఇంట్లో 2 మీటర్లను ట్యాంపర్ చేసి కరెంటు దొంగిలించారని తెలిపింది. 2KW కనెక్షన్‌పై 16.15KW లోడ్ పడుతోందని పేర్కొంది. ఆర్నెల్లుగా కరెంటు బిల్లు జీరో వస్తున్నట్టు గుర్తించింది. సంభల్‌లో ఆక్రమణలను తొలగిస్తున్న ప్రభుత్వం ఓ వర్గం కరెంటును దొంగిలిస్తోందని గుర్తించి చర్యలు తీసుకుంటోంది. పోలీసుల సాయంతో స్మార్ట్ మీటర్లు పెడుతోంది.

Similar News

News February 5, 2025

Breaking: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

image

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. కులగణన ఫామ్‌‌కు నిప్పుపెట్టడంపై వివరణ కోరుతూ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కులగణనను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాంటిది ఆ ఫామ్‌కు నిప్పుపెట్టడంతో మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆయన్ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

News February 5, 2025

తొలిసారి Girl Friend గురించి చెప్పిన బిల్‌గేట్స్

image

తనకు సరైన ప్రేయసి దొరికిందని, ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ అన్నారు. తామిద్దరం కలిసి ఒలింపిక్స్, అనంత్ అంబానీ పెళ్లి సహా ప్రపంచమంతా చుట్టేస్తున్నామని తెలిపారు. చాలా సరదాగా గడుపుతున్నామని వెల్లడించారు. ఒరాకిల్ మాజీ CEO మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డే ఆయన ప్రేయసి. 2019లో భర్త చనిపోయాక ఆయన వద్దకు చేరారు. కొన్ని కారణాలతో గేట్స్‌తో మిలిండా విడాకులు తీసుకోవడం తెలిసిందే.

News February 5, 2025

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

image

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. 2023లో తనను ఇబ్బంది పెట్టారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు DSPగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల మాజీ CI ఈశ్వరయ్య, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాశ్‌పై కేసులు నమోదయ్యాయి.

error: Content is protected !!