News October 5, 2024

గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు BJP MP నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు. ‘ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం. నయబ్ సింగ్ మళ్లీ CM అవుతారు’ అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 90 స్థానాలకు ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది.

Similar News

News February 3, 2026

అంబటి ఇంటిపై దాడి ఘటన.. TDP నేతలపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో TDP నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి ఫిర్యాదు మేరకు గుంటూరు పట్టాభిపురం PSలో టీడీపీ కార్పొరేటర్‌ ఇసుక బుజ్జి సహా పలువురిపై కేసు పెట్టారు. ఇంటిపై దాడి చేసి ఆస్తి ధ్వంసం, అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంబటిని కస్టడీకి ఇవ్వాలని నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

News February 3, 2026

APSRTC కోసం 2,500 కొత్త బస్సులు

image

AP: ఈ ఏడాది చివరి నాటికి 2,500 ఎలక్ట్రిక్/CNG బస్సులను కొనుగోలు చేస్తామని RTC ఇన్‌ఛార్జ్ MD కృష్ణబాబు తెలిపారు. PM ఈ-బస్ పథకం కింద 1050 విద్యుత్ బస్సులు రానున్నాయని, అదనంగా మరో 1450 ఎలక్ట్రిక్, CNG బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. RTCలో డ్రైవర్లతో పాటుగా ఇతర నియామకాలను చేపడతామని, ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు EHSను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

News February 3, 2026

సమీకృత వ్యవసాయ విధానాలు (మోడల్స్)

image

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి సమగ్ర వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.