News November 4, 2024
కేంద్రమంత్రితో MP శ్రీకృష్ణదేవరాయలు భేటీ

AP: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. NIPER ఏర్పాటుకు భూమితో పాటు అన్ని విధాలుగా సహకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని నడ్డాను కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఆరోగ్య పరీక్షలు చేసే కేంద్రాలను ఉత్తరాంధ్రలో లేదా రాయలసీమలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేలా వెసులుబాటు కల్పించాలని కోరారు.
Similar News
News December 10, 2025
పోలింగ్కు ఏర్పాట్లు సిద్ధం.. 890 పంచాయతీలు ఏకగ్రీవం

TG: రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రెస్మీట్లో తెలిపారు. తొలి, రెండో విడతల్లో 890 గ్రామాల్లో ఏకగ్రీవమైనట్లు చెప్పారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.8.2Cr సీజ్ చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు చేపట్టిందని తెలిపారు. 50వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నట్లు వెల్లడించారు.
News December 10, 2025
దేవుడిని నిందించడం తగునా?

కొందరికి సంపదలు, మరికొందరికి దారిద్ర్యం ఉండటానికి భగవంతుడే కారణమని చాలామంది అనుకుంటారు. కానీ, మన జీవితంలోని లోటుపాట్లకు మనమే బాధ్యులం. మనిషి జీవితం ఈ ఒక్క జన్మకే పరిమితం కాదని, నూరు జన్మల కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవిస్తామని శాస్త్రాలు చెబుతాయి. ‘భగవంతుడు అందరిపై సమాన అనుకూలతలు కల్పిస్తాడు. జీవులు తమ స్వభావం, కర్మలకు అనుగుణంగా ఎదుగుతారు. దుష్కర్మలు చేసి, దేవుడిని నిందించడం తప్పు’ అని పేర్కొంటాయి.
News December 10, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిందని మహిళా డీఎస్పీపై ఫిర్యాదు

రాయ్పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్షిప్లోకి దింపి, బ్లాక్మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్ ఓనర్షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.


