News June 22, 2024

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

image

AP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు ఖరారైంది. పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు CBN దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు.. ఇటీవల టీడీపీలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు.

Similar News

News December 18, 2025

రూపాయికే ఇంటర్నెట్ ప్యాక్: ‘డబ్బా’ నెట్‌వర్క్

image

‘PM వాణి’ అమలులో భాగంగా రూపాయి నుంచి ఇంటర్నెట్ ప్యాక్‌లు అందిస్తున్నట్లు బెంగళూరు సంస్థ ‘డబ్బా’ నెట్‌వర్క్ తెలిపింది. తమ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. PM వాణి పథకం ద్వారా ఎవరైనా తమ ఏరియాలో వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ పంపిణీదారుగా మారొచ్చు. డేటా ప్యాక్‌ల ద్వారా వైఫై అందిస్తారు. డబ్బా నెట్‌వర్క్ ఏడాదిలో 73,128 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటుచేసింది.

News December 18, 2025

భారీ జీతంతో OICLలో 300 జాబ్స్

image

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 AO పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 10న ప్రిలిమ్స్, FEB 28న మెయిన్స్ నిర్వహిస్తారు. నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.250. వెబ్‌సైట్: orientalinsurance.org.in/

News December 18, 2025

డేంజర్ పురుగు.. మరో ప్రాణం తీసింది!

image

AP: ‘స్క్రబ్ టైఫస్’తో రాష్ట్రంలో మరో <<18463808>>మరణం<<>> సంభవించింది. అన్నమయ్య(D) పీలేరు మోడల్ కాలనీకి చెందిన మంగమ్మ(60) ఇటీవల తీవ్ర జ్వరానికి గురయ్యారు. కుమారుడు ఆమెను రుయా ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. మంగమ్మ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనతో అన్నమయ్య జిల్లా వైద్యాధికారులు మోడల్ కాలనీని సందర్శించారు. జ్వర బాధితులకు స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు.