News July 1, 2024
MP లావు కృష్ణ దేవరాయలు నేటి పర్యటన వివరాలు
నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు MP లావు అందుబాటులో ఉండరని పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ గమనించవలసిందిగా తెలిపారు.
Similar News
News September 21, 2024
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు శనివారం రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలు తమ వినతి పత్రాలను అందించే వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు వచ్చే అవకాశం ఉంది.
News September 21, 2024
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
బాలిక అత్యాచారానికి గురైన కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు, రూ.50వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి కె.నీలిమ శుక్రవారం తీర్పు చెప్పారు. పీపీ కె.శ్యామల కథనం ప్రకారం చాకలి గుంటకు చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని బాణావత్ గోపి నాయక్ అత్యాచారం చేశాడు. పెళ్లి కోసం ఇంటి నుంచి పరారైన బాలికను షేక్ మహమ్మద్ రఫీ అనే ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.
News September 21, 2024
గుంటూరు: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్(Y22 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి 30 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.