News March 30, 2024

MPL: జ్యూస్ అనుకుని కిరోసిన్ తాగిన బాలుడు

image

జ్యూస్ అనుకుని ఓ బాలుడు కిరోసిన్ తాగిన ఘటన మదనపల్లెలో జరిగింది. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల వివకాల మేరకు.. మదనపల్లె పట్టణం బీకేపల్లిలో ఉంటున్న వెంకటరమణ కుమారుడు వేదిక్(5) ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున జ్యూస్ అనుకొని కిరోసిన్ తాగేశాడు. కుటుంబీకులు గమనించి బాలుడిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

Similar News

News April 13, 2026

చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

image

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.

News April 12, 2026

తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.

News April 12, 2026

చిత్తూరు: ప్రవేశాలకు గడువు పెంపు

image

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 20కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో 10వ తేదీ వరకు 6వ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందాయని చెప్పారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.