News April 19, 2025
MPL: చిరుత మృతి.. వెలుగులోకి కొత్త విషయాలు?

మదనపల్లె పొన్నేటిపాళ్యం వద్ద చిరుత పులిని చంపిన కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా, తప్పించుకు తిరుగుతున్న వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు.. వన్యప్రాణులను వేటాడి బక్షించడమే కాకుండా నగదుకు విక్రయాలు చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలిందని సమాచారం. దీని వెనక ప్రొఫెషనల్స్ ముఠా ఉన్నట్లు తెలుస్తోది.
Similar News
News April 19, 2025
NGKL: ధరణితో నరకం: మంత్రి జూపల్లి

గత BRS ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు నరకం అనుభవించారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. భూభారతి చట్టంపై గగ్గలపల్లిలో నిర్వహించిన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. రైతుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి వారి సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన భూభారతి చట్టం 100 ఏళ్ల వరకు భూ సమస్యలు తలెత్తకుండా ఉపయోగపడుతుందన్నారు.
News April 19, 2025
HYD: రివాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షలతో పాటు దూరవిద్య ఎంసీఏ పరీక్ష రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News April 19, 2025
మొక్కలు నాటిన నారాయణపేట కలెక్టర్, ఎమ్మెల్యే

మరికల్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ కార్యాలయంలో శనివారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని రంగులతో నూతనంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ను అధికారులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మార్వో అనిల్ కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.