News June 6, 2024

తెలుగు రాష్ట్రాల ఎంపీల వద్దే అత్యధిక ఆస్తులు

image

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీల్లో 93 శాతం మిలియనీర్లు ఉన్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 543 మంది ఎంపీల్లో ఈ సంఖ్య 504గా ఉందని తెలిపింది. టాప్-3లో టీడీపీ ఎంపీ చంద్రశేఖర్(AP-రూ.5,705 కోట్లు), బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(TG-రూ.4,568 కోట్లు), నవీన్ జిందాల్(హరియాణా-రూ.1,241 కోట్లు) ఉన్నారని పేర్కొంది. 2019లో 475 మంది మిలియనీర్లు MPలుగా ఉండగా, 2014లో 443 మంది ఉన్నారు.

Similar News

News February 3, 2026

‘భోలే బాబా’ను తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి: సత్యకుమార్

image

AP: పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసేలా రూల్స్ మార్చి YCP బరి తెగించిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘TTD నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదని YCP అంటోంది. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? కల్తీ అయిందని జగన్ హయాంలో CFTRI తేల్చినా పట్టించుకోలేదు. భోలేబాబా డెయిరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి.’ అని పేర్కొన్నారు. CMగా జగన్ అన్యమతస్థులను TTDలో నియమించారని విమర్శించారు.

News February 3, 2026

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

image

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<>WDCW<<>>) కర్నూలు 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, హౌస్ కీపర్, ఆయా పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ/డిప్లొమా(ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్), టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in

News February 3, 2026

మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

image

మైతేయి, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ రాష్ట్రానికి కొత్త CM ఖరారయ్యారు. BJP సీనియర్ నేత, మాజీ స్పీకర్ యుమ్నాం ఖేంచంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. శాంతి భద్రతల పునరుద్ధరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కోనున్నారు.