News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: జనగామ జిల్లా UPDATES

image

జనగామ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇటీవల విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 783 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 134 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,01,101 ఓటర్లు ఉన్నారు.

Similar News

News December 12, 2025

ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

image

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.

News December 12, 2025

వరంగల్: ఎనిమిది మందికి ఎస్సైలుగా పదోన్నతి

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మందికి ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో యాదగిరి, సుదర్శన్, కృష్ణమూర్తి, అజీద్దున్, రవీంద్రచారి, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి ఉన్నారు.

News December 12, 2025

ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్యలను నివారించాలి: ఎంపీ మహేష్

image

గత నెల నవంబర్ 6న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆటోమేషన్ సిస్టంలో సమస్య ఏర్పడిన విషయాన్ని ఏలూరు ఎంపీ మహేష్ పార్లమెంటులో శుక్రవారం ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న IP- ఆధారిత ఆటోమేటిక్ మెసేజ్ సెర్చింగ్ సిస్టం స్థానంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టంను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు.