News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: జనగామ జిల్లా UPDATES

జనగామ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇటీవల విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 783 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 134 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,01,101 ఓటర్లు ఉన్నారు.
Similar News
News December 22, 2025
పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు: జూపల్లి

TG: పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని <<18633566>>KCR<<>>ను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ‘BRS పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వారి హయాంలో ప్రధాన కాలువలు పూర్తి చేయలేదు. పాలమూరు-RRని తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన KCR ఇప్పుడేమో సాగునీటి ప్రాజెక్టు అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.40-50 వేల కోట్లు కావాలి’ అని చెప్పారు.
News December 22, 2025
అమలాపురం: PGRSకు 250 అర్జీలు

అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన PGRSకు 250 అర్జీలు అందాయని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, వసతుల కల్పన వంటి అంశాలపై ప్రజలు వినతులు అందజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News December 22, 2025
బీజేపీతోనే సుపరిపాలన సాధ్యం: MP పురందీశ్వరి

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని MP పురందీశ్వరి అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా సోమవారం రాజమండ్రిలోని తన కార్యాలయం వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా సుపరిపాలన అందుతోందని పేర్కొన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


