News February 19, 2025
‘మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి <<15514963>>ఖండించారు.<<>> ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.
Similar News
News December 4, 2025
పుతిన్ పర్యటన.. ఫొటోలు పంచుకున్న ప్రధాని

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. స్వయంగా ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఒకే కారులో ఇద్దరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి PM మోదీ కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘నా ఫ్రెండ్ అధ్యక్షుడు పుతిన్ను స్వాగతించినందుకు సంతోషిస్తున్నాను. రేపు మా మధ్య జరగబోయే సమావేశాల కోసం ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం మన ప్రజలకు ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్ చేశారు.
News December 4, 2025
పుతిన్ పర్యటన ప్రతి అడుగులో ‘FSO’ నిఘా

అత్యంత పటిష్ఠ భద్రత మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది. విదేశీ ప్రముఖుల భద్రతను ఆతిథ్య దేశాలే సహజంగా పర్యవేక్షిస్తుంటాయి. పుతిన్ పర్యటనను మాత్రం రష్యాలోని రహస్య సంస్థ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ చూస్తుంది. ఆయన ఉండే భవనం, తీసుకొనే ఆహారం సహా ప్రతి అడుగులో పలు జాగ్రత్తలు తీసుకుంటారని మాజీ బాడీగార్డు ఒకరు తెలిపారు. పుతిన్ తినే ఫుడ్ను ఫస్ట్ ఓ బాడీగార్డ్ టేస్ట్ చేస్తారని చెప్పారు.
News December 4, 2025
ఈ 3 బ్యాంకులు సేఫ్: RBI

భారత ఆర్థిక వ్యవస్థకు SBI, HDFC, ICICI బ్యాంకులు మూల స్తంభాలని RBI తెలిపింది. వీటిలో డబ్బు సేఫ్గా ఉంటుందని వెల్లడించింది. RBI రూల్స్ ప్రకారం, కామన్ ఈక్విటీ టైర్1 కింద ఎక్కువ నగదు, క్యాపిటల్ ఫండ్ మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ బ్యాంక్ కార్యకలాపాలు, అకౌంట్ హోల్డర్ల డబ్బుపై ప్రభావం చూపదు. అందుకే, ఇవి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు(D-SIB)గా గుర్తింపు పొందాయి.


