News November 2, 2024

తన డీప్‌ఫేక్ ఫొటోపై స్పందించిన మృణాల్

image

సినీ ఇండస్ట్రీని డీప్‌ఫేక్ వెంటాడుతూనే ఉంది. తాజాగా నటి మృణాల్ ఠాకూర్‌తో దీపావళి టపాసులు కాల్చినట్లు ఓ వ్యక్తి ఫొటో ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది వైరలవడంతో దీనిపై మృణాల్ స్పందించారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మీరెందుకు ఇలా తప్పుగా ఫొటోలు ఎడిట్ చేస్తున్నారు? ఈ పని బాగుంది అనుకుంటున్నారా? అస్సలు బాలేదు’ అని కామెంట్ చేశారు. గతంలోనూ అసభ్యకర వీడియోకు రష్మికతో డీప్‌ఫేక్ చేశారు.

Similar News

News December 4, 2025

అనుముల: ఇక్కడ నామినేషన్లు నిల్

image

అనుముల మండలం మొత్తం పంచాయతీ ఎన్నికల సందడిగా నెలకొనగా పేరూర్ గ్రామంలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పేరూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఓటరు ఒక్కరూ లేరు. రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల చివరి రోజు వరకూ సర్పంచ్ స్థానానికి, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

News December 4, 2025

తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

image

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్‌(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్‌లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.

News December 4, 2025

ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

image

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.