News March 4, 2025

MROలపై చర్యలు తీసుకుంటాం: జేసీ

image

అల్లూరి జిల్లాలో మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జేసీ అభిషేక్ గౌడ ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రైతుల రిజిస్ట్రేషన్, భూ సర్వే, మ్యుటేషన్లపై కలెక్టరేట్‌లో మంగళవారం వీసీ నిర్వహించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లకు సూచించారు. MROలు ఆఫీసులకు రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 2, 2025

IPL మినీ ఆక్షన్.. 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్

image

ఐపీఎల్ మినీ ఆక్షన్ కోసం 14 దేశాల నుంచి 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. వీరిలో మయాంక్ అగర్వాల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ చాహర్, కేఎస్ భరత్, పృథ్వీషా తదితరులు ఉన్నారు. భారత్ నుంచి కేవలం రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్.. గ్రీన్, స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్ తదితర 47 మంది ఫారిన్ ప్లేయర్లే రూ.2కోట్ల బేస్ ప్రైజ్ లిస్టులో ఉన్నారు. ఈ నెల 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది.

News December 2, 2025

క్రైస్తవ సేవా/ ప్రతిభ అవార్డులకు DEC 6 LAST DATE

image

సామాజిక, విద్యా, వైద్య, సాహిత్యం, కళా, క్రీడా వంటి రంగాల్లో విశిష్ట సేవలు లేదా ప్రతిభ కనబరిచిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందించనున్నట్లు PDPL జిల్లా ఇన్‌ఛార్జ్ మైనారిటీల సంక్షేమ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వ్యక్తులు లేదా ఉత్తమ సేవా సంస్థలు DEC 6 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. నామినేషన్ ఫారాలు www.tscmfc.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

News December 2, 2025

హైదరాబాద్‌లో అజయ్​ దేవ్​గన్​ ఫిల్మ్​ సిటీ!

image

TG: రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’ వేదిక కానుంది. HYDలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU కుదుర్చుకోనున్నారు. అలాగే నైట్ సఫారీ ఏర్పాటుకు రిలయన్స్‌కు చెందిన వనతార యానిమల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ ముందుకొచ్చింది. ఫుడ్‌లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మాణానికి ఒప్పందం చేసుకోనుంది.