News January 12, 2025
ఎంఎస్ ధోనీ భయం ఎరగని వ్యక్తి: యోగరాజ్ సింగ్

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఫియర్లెస్ మ్యాన్ అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అన్నారు. ఆయన ఒక మోటివేటెడ్ కెప్టెన్ అని ప్రశంసలు కురిపించారు. కాగా గతంలో తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్ను ధోనీ సర్వనాశనం చేశాడని యోగరాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని హెచ్చరించారు. ఎప్పటికీ అతడిని క్షమించనని, అతడితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
మెస్సీ వచ్చాడు.. మంత్రి పదవి పోయింది!

మెస్సీ టూర్తో దేశంలో ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్ అయింది. కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం పర్యటన సందర్భంగా తీవ్ర <<18551215>>గందరగోళం<<>> తలెత్తిన విషయం తెలిసింది. దీంతో అందరిముందూ పరువు పోయిందంటూ బెంగాల్ CM మమత కన్నెర్రజేశారు. ఇంకేముంది ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దీన్ని ‘చాలా మంచి నిర్ణయం’ అని దీదీ పేర్కొనడం గమనార్హం. అయితే ఆయనను రాజీనామా చేయమన్నదే మేడమని మరో ప్రచారం.
News December 17, 2025
కౌలు రైతులకు రూ.లక్ష రుణం.. ఎవరు అర్హులు?

AP: కౌలు రైతులకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలను పొందవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతను ఎలా నిర్ణయిస్తారు?, ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 17, 2025
తుది పోరు.. పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.


