News March 19, 2024
బాపట్ల TDP MP అభ్యర్థిగా ఎంఎస్ రాజు

AP: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. వైసీపీపై ఆయన సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో ఆ పార్టీ టికెట్ కేటాయించింది. మరోవైపు ఆలపాటి రాజాకు పెనమలూరు సీటు కేటాయించినట్లు సమాచారం. అలాగే గంటా శ్రీనివాసరావుకు ఆసక్తి లేకపోయినా చీపురుపల్లి స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై TDP అధికారిక ప్రకటన చేయనుంది.
Similar News
News July 5, 2025
రేపు తొలి ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు: పండితులు

హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ఈసారి తొలి ఏకాదశి జులై 6న (ఆదివారం) వచ్చింది. రేపు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. ఇతరులతో గొడవ పడటం, వారిపై నిందలు వేయడం చేయొద్దని, పగటి పూట నిద్రపోవద్దని అంటున్నారు. ఉపవాసం ఉండాలని, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
మెగా PTM 2.0పై అపోహలు వద్దు: పాఠశాల విద్యాశాఖ

AP: ఈనెల 10న మెగా PTM 2.0లో (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.28cr+ మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించాలని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకుడు B.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రికార్డు కోసం మాత్రమే విట్నెస్ నమోదు అని, దీని వెనుక వేరే ఏ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. HMలు, టీచర్లు అపోహలు వీడాలని సూచించారు. ప్రభుత్వోద్యోగులు, పేరెంట్స్ కాకుండా ఎవరితోనైనా సంతకం చేయించొచ్చని పేర్కొన్నారు.
News July 5, 2025
గిల్ సరికొత్త చరిత్ర

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అరంగేట్రం చేసిన సిరీస్లోనే అత్యధిక పరుగులు(450+) చేసిన భారత కెప్టెన్గా నిలిచారు. దీంతో పాటు ఇంగ్లండ్లో ఒక టెస్టులో 300+ పరుగులు చేసిన తొలి ఆసియా కెప్టెన్, బ్యాటర్గానూ నిలిచారు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్సులో 52* రన్స్తో ఆడుతున్నారు.