News March 19, 2024
బాపట్ల TDP MP అభ్యర్థిగా ఎంఎస్ రాజు
AP: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. వైసీపీపై ఆయన సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో ఆ పార్టీ టికెట్ కేటాయించింది. మరోవైపు ఆలపాటి రాజాకు పెనమలూరు సీటు కేటాయించినట్లు సమాచారం. అలాగే గంటా శ్రీనివాసరావుకు ఆసక్తి లేకపోయినా చీపురుపల్లి స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై TDP అధికారిక ప్రకటన చేయనుంది.
Similar News
News July 5, 2024
రిషి సునాక్ ఓటమి.. మరోసారి మూర్తి సలహా వైరల్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో సెటైర్లు వేస్తున్నారు. తన మామగారి సలహాను పాటించకపోవడంతోనే రిషి ఓడిపోయారేమోనంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మూర్తి చెప్పిన సూత్రాన్ని UKలో అమలు చేస్తారేమోనని ఓడించారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
News July 5, 2024
రక్షణ ఉత్పత్తుల్లో రికార్డు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్లో రూ.1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు జరిగినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 2022-23తో పోలిస్తే ఏకంగా 16.8% పెరిగినట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భరత లక్ష్యాన్ని చేరుకోవడంలో PM ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ ఘనత సాధించినందుకు రక్షణ శాఖకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
News July 5, 2024
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు?
హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలేకు ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నట్లు సమాచారం. ఆయనకు 16 మంది బాడీగార్డులు, 15 నుంచి 30 ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న మెయిన్పురి ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆయన భార్య కోసం 6 లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయట.