News March 17, 2025
MTM: పదోతరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. భద్రతను పటిష్టం చేస్తూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులను జీఎంఎస్కేలతో తనిఖీ చేసి అనుమతించాలన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్లను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Similar News
News October 16, 2025
గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News October 16, 2025
కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్పై మందుబాబుల ఆందోళన.!

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
News October 16, 2025
కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్పై మందుబాబుల ఆందోళన.!

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.