News March 17, 2025

MTM: పదోతరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. భద్రతను పటిష్టం చేస్తూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులను జీఎంఎస్‌కేలతో తనిఖీ చేసి అనుమతించాలన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Similar News

News November 30, 2025

కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.

News November 30, 2025

కృష్ణాజిల్లాలో ఎంత మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే.?

image

కృష్ణాజిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 7,072 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరంతా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి, గుడివాడలోని పీ. సిద్దార్థ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2008 గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 12,052 మంది ఉండగా తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 7,072 మందికి తగ్గింది. #InternationalAidsDay.

News November 30, 2025

కృష్ణా జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.