News March 25, 2025

MTM: అర్జీల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

image

మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో విచారించి న్యాయం అందించడానికి జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు.

Similar News

News March 26, 2025

MTM: ఎస్సీల సంక్షేమానికి రూ.341 కోట్ల బడ్జెట్ : శ్రీదేవి

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.341 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మంగళవారం మచిలీపట్నం వచ్చిన ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు.

News March 25, 2025

MTM: ఎస్సీల సంక్షేమానికి రూ.341 కోట్ల బడ్జెట్ : శ్రీదేవి

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.341 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మంగళవారం మచిలీపట్నం వచ్చిన ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు.

News March 25, 2025

ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు: ఎమ్మెల్యే 

image

గుడివాడ – పామర్రు ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రైల్వే గేట్‌లపై నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. మంగళవారం జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో ఎమ్మెల్యే తన స్వగృహంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించారు. రైల్వే గేట్లపై ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరగలేదన్నారు.

error: Content is protected !!