News February 24, 2025

MTM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరపైకి వైసీపీ

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు తాము పోటీలో ఉండమని చెప్పి వైసీపీ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల తెరపైకి వచ్చింది. పార్టీపరంగా అభ్యర్థిని నిలబెట్టకపోయినా PDF అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ MLC KS లక్ష్మణరావుకు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. కూటమి అభ్యర్థి ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.

Similar News

News February 13, 2026

కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.

News February 13, 2026

కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

image

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.

News February 13, 2026

కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

image

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.