News March 27, 2025

MTM: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

ఇనుగుదురుపేట వర్రిగూడెంలో ఈ నెల 21న సంచలనం సృష్టించిన టోపీ శీను హత్య కేసును మచిలీపట్నం పోలీసులు ఛేదించారు. బుధవారం ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో బందర్ డీఎస్పీ సీహెచ్ రాజా మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఇల్లీగల్ కేసుకు సంబంధించి హత్య జరిగిన నాలుగు రోజుల్లోనే 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కడవకొల్లు దయాకర్‌ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News April 1, 2025

కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

image

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..

News April 1, 2025

ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ తీవ్ర హెచ్చరికలు 

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP గంగాధరరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రవీణ్ పగడాల మృతి కేసును పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసినా, ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. 

News April 1, 2025

కృష్ణా: చిన్నారి మృతి.. హృదయవిదారకం 

image

కృష్ణా (D) అవనిగడ్డ(M) పులిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి వాసులు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 నెలల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారికి నామకరణం చేసేందుకు మోపిదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని తరలిస్తుండగా కారు వెనుక సీటులో పసికందు పోలీసులకు కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పాపను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

error: Content is protected !!