News September 28, 2024
MUDA SCAM: సిద్దరామయ్యపై FIR నమోదు
ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు FIR రిజిస్టర్ చేశారు. IPC 351, 420, 240, 09, 120B సెక్షన్లను ప్రయోగించారు. సిద్దరామయ్య భార్య పార్వతి, బావమరిది, ఇతరుల పేర్లను అందులో మెన్షన్ చేశారు. బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఈ చర్యలు చేపట్టింది. రూ.56 కోట్ల విలువైన 14 సైట్లను పార్వతికి ముడా కేటాయించడంతో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Similar News
News October 15, 2024
84 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవసీ పాలసీని ఉల్లంఘించిన 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టులోనే ఈ సంఖ్యలో నిషేధం విధించినట్లు పేర్కొంది. వీటిలో అనుమానాస్పదంగా ఉన్న 16.61 లక్షల అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యగా బ్యాన్ చేసినట్లు తెలిపింది. కాగా ఆగస్టులో వాట్సాప్ గ్రీవెన్స్కు 10,707 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.
News October 15, 2024
‘దేవర’ విజయం: లేఖ రాసిన ఎన్టీఆర్
దేవర సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ఈరోజు ఓ లేఖ విడుదల చేశారు. ‘దేవర సినిమాకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీరు అందిస్తున్న ఆదరణకు థాంక్స్. నా సహనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. నెల రోజులుగా దేవరను ఓ పండుగలా జరుపుకొంటున్న నా ఫ్యాన్స్కు శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎప్పటికీ మీరు గర్వపడే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నారు.
News October 15, 2024
WTC: కోహ్లీ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తారా?
WTC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. WTCలో ఆయన 22 టెస్టులకు కెప్టెన్సీ చేయగా 14 మ్యాచుల్లో గెలిచి, ఏడింట్లో ఓడారు. ఒకటి డ్రాగా ముగిసింది. రోహిత్ శర్మ ఇప్పటివరకూ 18 మ్యాచుల్లో కెప్టెన్గా ఉన్నారు. ఇందులో 12 విజయాలు, 4 అపజయాలు, రెండు డ్రా మ్యాచులు ఉన్నాయి. NZతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ను 3-0తో గెలిస్తే కోహ్లీ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేస్తారు.