News October 1, 2024

MUDA SCAM: తన భార్య మానసిక క్షోభ బాధాకరమన్న సిద్దరామయ్య

image

తనకు కేటాయించిన 14 ప్లాట్లను ముడాకు తిరిగిచ్చేయాలన్న తన భార్య నిర్ణయం ఆశ్చర్యపరిచిందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కుటుంబానికే పరిమితమైన ఆమె ప్రతిపక్షాల కుట్రతో మానసిక క్షోభ అనుభవిస్తోందని తెలిపారు. ‘తల వంచకుండా అన్యాయానికి ఎదురెళ్లడమే నా మార్గం. కానీ నాపై జరిగిన రాజకీయ కుట్రతో ఆమె ఆవేదన చెందింది. ప్లాట్లను తిరిగివ్వాలని నిర్ణయించుకుంది. ఆమె మానసిక వేదన బాధాకరం’ అని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2024

SBI క్రెడిట్‌కార్డు యూజర్లకు గుడ్ న్యూస్

image

దేశవ్యాప్తంగా ఉన్న 19.5 మిలియన్ల SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ‘ఖుషియోన్ కా ఉత్సవ్’ పేరుతో కొనుగోళ్లపై ప్రత్యేక <>ఆఫర్లను<<>> ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్లు, మొబైల్ ఫోన్స్, ఫ్యాషన్&లైఫ్‌స్టైల్, ఆభరణాలు, ల్యాప్‌టాప్స్, టీవీలు, దుస్తులు, ఫుడ్, డొమెస్టిక్ ఫ్లైట్స్ టికెట్ ధరలు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, EMI ఆఫర్లు ఉన్నాయి.

News October 16, 2024

అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!

image

కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్‌ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.

News October 16, 2024

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

image

శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.