News September 25, 2024

MUDA SCAM: హైకోర్టు తర్వాత సిద్దరామయ్యకు షాకిచ్చిన స్పెషల్ కోర్టు

image

కర్ణాటక CM సిద్దరామయ్యకు మరో షాక్. ఆయన భార్య పార్వతికి ముడా అక్రమంగా 14 సైట్లు కేటాయించిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని లోకాయుక్త పోలీసులను స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌లో దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దూ వేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఆ తర్వాతి రోజే స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ లోకాయుక్తను ఇలా ఆదేశించడం గమనార్హం.

Similar News

News September 25, 2024

టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇతడే..

image

టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టాప్-5లో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ బ్యాటర్ ఇతడే. జైస్వాల్ టీ20ల్లో 4, టెస్టుల్లో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వన్డేల్లోనూ అవకాశాలు లభిస్తే అందులోనూ తన మార్క్ చూపించే అవకాశాలు ఉన్నాయి.

News September 25, 2024

30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు

image

బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్‌లో టీమ్ లీడర్‌గా ఉన్న రంజన్‌తో రిలేషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.

News September 25, 2024

కనిష్ఠ స్థాయికి ఆర్కిటిక్ సముద్రపు మంచు

image

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆర్కిటిక్ సముద్రపు మంచు Sep నెలలో వార్షిక కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏటా ఉత్తరార్ధగోళంలో మంచు గ‌ణ‌నీయ స్థాయిలో క్షీణిస్తోంది. నాసా, NSIDC డేటా సెంటర్ పరిశోధకుల ప్రకారం ఈ ఏడాది కనిష్ఠ పరిధి 4.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా న‌మోదైంది. సముద్రపు మంచు నష్టం ఏడాదికి 77,800 Sq.KM చొప్పున సంభవిస్తోంది. ఈ క్షీణత విస్తీర్ణంలో మాత్రమే కాకుండా మంచు నాణ్యతలో కూడా ఉంది.