News October 19, 2024
జనసేనలోకి ముద్రగడ కూతురు
AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఇవాళ సా.4 గంటలకు జనసేన పార్టీలో చేరనున్నారు. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆమెకు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆమెతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు నుంచి పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.
Similar News
News October 19, 2024
‘మూసీ’కి డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?: KTR
TG: రైతు భరోసా అమలు చేసే వరకూ కాంగ్రెస్ను వదిలేది లేదని KTR అన్నారు. ‘కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఇవ్వదన్న KCR మాటలను రేవంత్ సర్కార్ నిజం చేసింది. స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే చేతులేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బుల్లేక సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?’ అని ప్రశ్నించారు. రేపు అన్ని మండలాల్లో ఆందోళనలు చేయాలని BRS శ్రేణులకు పిలుపునిచ్చారు.
News October 19, 2024
నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
TG: మార్పు కావాలనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరుకే ప్రతి నియోజకవర్గానికి 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నొక్కి చెప్పారు. అర్హత ఉంటే ఎలాంటి రికమండేషన్ అవసరం లేదన్నారు. రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
News October 19, 2024
రచిన్, సర్ఫరాజ్లను అభినందించిన సచిన్
టెస్టులో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ‘క్రికెట్ మన మూలాలను కలుపుతుంది. బెంగళూరుతో రచిన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడే అతను సెంచరీ చేశారు. పరుగుల లోటులో ఉన్న తన జట్టుకు సర్ఫరాజ్ అండగా నిలుస్తూ సెంచరీ బాదారు. ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లకి మున్ముందు మంచి కాలం ఉంటుంది’ అని తెలిపారు.