News April 3, 2024
మథుర కాంగ్రెస్ అభ్యర్థిగా ముకేశ్ ధన్గర్

UPలోని మథుర లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముకేశ్ ధన్గర్ పోటీ చేయనున్నారు. ఈ సీటును తొలుత బాక్సర్ విజేందర్ సింగ్కు కేటాయించగా, ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. దీంతో ఈ సీటును ముకేశ్తో భర్తీ చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి నటి హేమమాలిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మథురతో పాటు సీతాపూర్ అభ్యర్థిని కూడా హస్తం పార్టీ మార్చింది. ఇక్కడ నకుల్ దూబే స్థానంలో రాకేశ్ రాథోడ్ పోటీకి దిగనున్నారు.
Similar News
News November 15, 2025
‘సజ్జనార్’ పేరుతోనే ఫ్రెండ్ను మోసగించిన సైబర్ నేరగాళ్లు!

సైబర్ నేరాలపై అవగాహన కల్పించే హైదరాబాద్ CP సజ్జనార్ మిత్రుడికి కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. ఆయన పేరుతో ఫేక్ FB అకౌంట్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నానంటూ డబ్బులు పంపాలని మెసేజ్లు పంపారు. దీంతో ఇది నిజమే అనుకొని తన స్నేహితుడు రూ.20వేలు పంపించి మోస పోయారని సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్బుక్లో డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి’ అని ఆయన సూచించారు.
News November 15, 2025
అబార్షన్ అయినా లీవ్ తీసుకోవచ్చు

మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి గర్భస్రావం. ప్రమాదవశాత్తూ అబార్షన్ అయినా, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి తప్పనిసరై గర్భస్రావం చేయాల్సి వచ్చినా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం-1971 ప్రకారం అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినులు ఆరు వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే దీనికి తగిన డాక్యుమెంట్లు చూపించాలి. అబార్షన్ కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైతే మరో నెల అదనంగా సెలవు పొందవచ్చు.
News November 15, 2025
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.


