News April 3, 2024
మథుర కాంగ్రెస్ అభ్యర్థిగా ముకేశ్ ధన్గర్

UPలోని మథుర లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముకేశ్ ధన్గర్ పోటీ చేయనున్నారు. ఈ సీటును తొలుత బాక్సర్ విజేందర్ సింగ్కు కేటాయించగా, ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. దీంతో ఈ సీటును ముకేశ్తో భర్తీ చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి నటి హేమమాలిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మథురతో పాటు సీతాపూర్ అభ్యర్థిని కూడా హస్తం పార్టీ మార్చింది. ఇక్కడ నకుల్ దూబే స్థానంలో రాకేశ్ రాథోడ్ పోటీకి దిగనున్నారు.
Similar News
News November 28, 2025
భోగాపురం కనెక్టివిటీపై బ్రేకులు

భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు VMRDA ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రాజెక్ట్పై పురోగతి కనబడటం లేదు. VMRDA ఏడాది క్రితం రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. ట్రాఫిక్ను అరికట్టాలనే లక్ష్యంతో ప్లాన్ చేసినా.. భూసేకరణ, వివాదాలు పనులకు అడ్డంకిగా మారాయి. ఏడాది క్రితమే ప్రాసెస్ ప్రారంభమైనా పురోగతి కనబడకపోవడంతో ట్రాఫిక్ తిప్పలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


