News May 10, 2024

పోస్టల్ బ్యాలెట్‌ వివరాలు వెల్లడించిన ముఖేశ్ కుమార్

image

AP: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తాజాగా వెల్లడించారు. ‘నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో 25 పార్లమెంటు స్థానాలకు 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4,44,218 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నెల్లూరులో అత్యధికంగా 22,650 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా అమలాపురం(ఎస్సీ)లో 14,526 ఓట్లు పోలయ్యాయి’ అని వివరించారు.

Similar News

News November 1, 2025

సంసార చక్రం నుంచి విముక్తి పొందాలంటే..

image

మన జీవుడికి 3 రకాల శరీరాలు ఉంటాయి. అవి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరంలోనే(భౌతిక దేహం) అన్ని కర్మలు చేస్తాం. సూక్ష్మశరీరం(మనస్సు, ఇంద్రియాలు) సుఖదుఃఖాలను అనుభవిస్తుంది. కారణశరీరం(అజ్ఞాన రూపం) ఆత్మానందాన్ని పొందుతుంది. మనం చేసే పుణ్యపాప కర్మల ఫలంగా సుఖదుఃఖాలు కలుగుతాయి. జీవుడిలా కర్మల బంధంలో, సంసార చక్రంలో తిరుగుతాడు. వీటి నుంచి విముక్తి పొందడానికి శివుడిని ప్రార్థించడమే మార్గం.<<-se>>#SIVOHAM<<>>

News November 1, 2025

వెనిజులాపై దాడులు చేస్తారా? ట్రంప్ ఏమన్నారంటే

image

వెనిజులాలో కొకైన్ ఫెసిలిటీస్, డ్రగ్ ట్రాఫికింగ్ రూట్లపై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వచ్చిన <<18162638>>వార్తలను<<>> ప్రెసిడెంట్ ట్రంప్ ఖండించారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. మరోవైపు కరీబియన్, ఈస్టర్న్ పసిఫిక్‌లో గత నెల నుంచి ఇప్పటివరకు 15 అనుమానిత డ్రగ్ స్మగ్లింగ్ బోట్లపై యూఎస్ దాడులు జరిపింది. ఈ ఆపరేషన్లలో ఇప్పటివరకు 61 మంది మరణించారు. కాగా పడవలపై దాడుల్ని ఆపేయాలని USను UN కోరింది.

News November 1, 2025

నేడు శ్రీసత్యసాయి జిల్లాలో CM CBN పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో మ.12.45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించనున్నారు. పెన్షన్ లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.