News October 21, 2024
నవంబర్ 1న ‘మూరత్’ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ‘మూరత్’ ట్రేడింగ్ను నవంబర్ 1న సా.6-7 గంటల మధ్య నిర్వహించనున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. హిందూ కాలమానం ప్రకారం ఆరోజు నుంచి ‘సంవత్ 2081’ ప్రారంభం అవుతుంది. మదుపరులు, బ్రోకర్లకు మూరత్ ట్రేడింగ్ భోగభాగ్యాలు ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే చాలామంది ఆరోజు కనీసం ఒక్క షేర్ అయినా కొనుగోలు చేయాలని చూస్తారు. అంతకుముందు రోజు(దీపావళి-అక్టోబర్ 31)న ప్రీఓపెనింగ్ సెషన్ ఉంటుంది.
Similar News
News October 21, 2024
SSC కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్
TG: SSC జీడీ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి జనవరి 31 వరకు టీ-శాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇటు 1,388 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి కంటెంట్ను మరో రెండు గంటలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 16 వరకు రోజూ 4గంటలు ప్రసారం చేస్తామన్నారు.
News October 21, 2024
అందుకే హిందీలో మాట్లాడను: సమంత
పలకడంలో తప్పులు దొర్లుతాయనే భయంతోనే స్టేజీపైన హిందీలో మాట్లాడనని హీరోయిన్ సమంత అన్నారు. ‘సిటాడెల్’లో హనీ(సమంత)కి హిందీ బాగా వచ్చని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయాన్ని దర్శకులు గుర్తించలేకపోయారని అన్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 సమయంలో సమంత హిందీ మాట్లాడకపోవడం చూసి సిటాడెల్లో వేరే హీరోయిన్ని తీసుకోవాలని భావించినట్లు దర్శకులు రాజ్ అండ్ డీకే చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు.
News October 21, 2024
రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు ముఖ్యం: CM రేవంత్
TG: ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. గోషామహల్లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.