News August 25, 2024

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. గణేశ్ ఉత్సవ కమిటీల కీలక నిర్ణయం

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో ఈసారి గణేశ్ ఉత్సవాలను సాధారణంగా నిర్వహించాలని అక్కడి కమిటీలు నిర్ణయించాయి. ఈసారి మండపాన్ని ‘అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం’ అనే థీమ్‌తో ఏర్పాటు చేస్తామని ఓ కమిటీ వెల్లడించింది. చందర్‌నగర్‌‌లోని శాటిలైట్ టౌన్‌షిప్ సాల్ట్ లేక్‌లో నిర్వహించే లైట్‌షోను రద్దు చేస్తున్నట్లు అక్కడి కమిటీ తెలిపింది. ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకు భారీగా ప్రజలు హాజరవుతారు.

Similar News

News December 4, 2025

కంట్రోల్ రూమ్‌లను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్&మానిటరింగ్ కమిటీ, సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉంటే, ఎన్నికలకు సంబంధించిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 96662 34383 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News December 4, 2025

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

image

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్‌లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.