News September 6, 2024
సెంచరీతో సచిన్ రికార్డును దాటిన ముషీర్ ఖాన్!

దులీప్ ట్రోఫీలో ఇండియా-బి, ఇండియా-ఏకు మధ్య జరిగిన మ్యాచ్లో ముషీర్ ఖాన్ 181 పరుగులు చేసి తన జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ టోర్నీ చరిత్రలో డెబ్యూలో అత్యధిక స్కోరు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ను దాటేశారు. బాబా అపరాజిత్(212), యశ్ ధుల్(193) తొలి రెండు స్థానాల్లో ఉండగా సచిన్(159) మూడో స్థానంలో ఉండేవారు. ముషీర్ ఆయన్ను 4వ స్థానానికి నెట్టి థర్డ్ ప్లేస్కు చేరుకున్నారు.
Similar News
News January 20, 2026
కరూర్ తొక్కిసలాట.. నిందితుడిగా విజయ్ పేరు?

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి CBI <<18898953>>విచారణకు<<>> నిన్న రెండోసారి విజయ్ హాజరైన విషయం తెలిసిందే. త్వరలో ఆయన్ను నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఏడీజీపీ, మరో పోలీసు అధికారిపైనా అభియోగాలు మోపే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో CBI ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని, అందులో విజయ్ పేరు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారు.
News January 20, 2026
విజయ్తో పెళ్లి.. త్వరలో క్లారిటీ: రష్మిక

హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటారని జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ రష్మిక ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘గత నాలుగేళ్లుగా కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడుతాను. అప్పుడే నిజం తెలుస్తుంది’ అని చెప్పారు. వచ్చే నెలలో వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
News January 20, 2026
50% రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా అప్లై చేయాలి?

తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40% నుంచి 50% రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. దీని వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హతలు, రాయితీ, అందించే యంత్రాలు, దరఖాస్తు వివరాల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


