News October 16, 2024
సీఎం రేవంత్ను కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ DSP

మ్యూజికల్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 19న కన్సర్ట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ షోకు రావాలని ఆహ్వానించేందుకు డీఎస్పీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నిర్మాత బండ్ల గణేశ్తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్కు ఆయన గిటార్ను బహుమతిగా అందించారు. కాగా, HYDలో ఈ కన్సర్ట్ స్టార్ట్ చేసి దేశంలోని పలుచోట్ల నిర్వహించనున్నారు.
Similar News
News January 19, 2026
ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.
News January 19, 2026
రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 19, 2026
పాంటింగ్ను దాటేసిన కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో నం.3 పొజిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ(12,676) నిలిచారు. నిన్న న్యూజిలాండ్తో మ్యాచులో సెంచరీతో ఈ రికార్డును చేరుకున్నారు. 60+ సగటుతో 93కి పైగా స్ట్రైక్ రేట్తో ఆయన కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్(12,662), సంగక్కర(9,747), కల్లిస్(7,774), కేన్ విలియమ్సన్(6,504) ఉన్నారు.


