News January 11, 2025
మస్క్ పిచ్చివాడవుతున్నారు: బయోగ్రఫీ రచయిత

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండేకొద్దీ పిచ్చివాడవుతున్నారని ఆయన జీవిత కథ రాస్తున్న అబ్రామ్సన్ ఆరోపించారు. మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మస్క్కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బయోగ్రాఫర్గా గడచిన రెండేళ్లుగా మస్క్ ఆన్లైన్ ప్రవర్తన నిశితంగా చూస్తున్నాను. భారీగా డ్రగ్స్ వాడకం, ఒత్తిడి కారణంగా ఎలాన్కు లోలోపల ఏదో తేడా చేసింది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 21, 2025
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆర్డినెన్స్!

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21ను సవరించేందుకు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయటమే ప్రత్యామ్నాయం. రెండు రోజుల్లో దానికి సంబంధించిన ఫైలును గవర్నర్కు పంపి ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
News October 21, 2025
మురిపించని ‘మూరత్’.. ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు!

దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ సెషన్ పెద్దగా మురిపించలేదు. మొదట లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల స్వల్ప లాభంతో 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 25,868 వద్ద ముగిశాయి. నిఫ్టీలో సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ట్రేడ్ అవగా, కొటక్ మహీంద్రా, ICICI బ్యాంకులు, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.
News October 21, 2025
భార్యకు దూరంగా సెహ్వాగ్!

మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన దీపావళి పోస్టులో భార్య కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తల్లి, పిల్లలతో ఉన్న ఫొటోనే వీరూ షేర్ చేశారు. ఆయన భార్య ఆర్తి సైతం పిల్లలతో దిగిన ఫొటోనే పంచుకున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారని, సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకున్నారని నేషనల్ మీడియా తెలిపింది. దీంతో విడాకుల రూమర్స్ పెరిగాయి. సెహ్వాగ్ చివరిసారిగా 2023 ఆగస్టులో భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.