News April 21, 2025
సిద్ధివినాయక ఆలయంలో మస్క్ తల్లి పూజలు

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తల్లి మాయె మస్క్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆమె ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కాగా తాను రాసిన ‘ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’ పుస్తకాన్ని రాజ్కమల్ బుక్స్ హిందీలోకి అనువదించింది. ఆ పుస్తకం విడుదల కోసం ఆమె భారత్ వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News August 7, 2025
వచ్చే వారంలో ట్రంప్, పుతిన్ భేటీ!

US ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ తొలుత పుతిన్తో వ్యక్తిగతంగా సమావేశమవుతారని, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి రష్యాతో సీజ్ ఫైర్పై చర్చిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘రష్యన్లు ట్రంప్ను కలవాలనుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు’ అని వైట్హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
News August 7, 2025
AP న్యూస్ రౌండప్

☞ విశాఖలో రూ.35Crతో 5 ఎకరాల్లో థీమ్ పార్క్ ఏర్పాటు: మంత్రి దుర్గేశ్
☞ CM స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక్క <<17326231>>జడ్పీటీసీ<<>> స్థానం కోసం ఇంతగా దిగజారిపోతారా: YS జగన్
☞ స్కూళ్లలో ఈ నెల 11 నుంచి ఫార్మెటివ్-1 పరీక్షలు
☞ సర్పంచ్, MPTC ఉప ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత
☞ ఈ నెల 24న గ్రామ సర్వేయర్లకు శాఖాపరమైన పరీక్షలు
News August 7, 2025
DOST: స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. 54,048 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. కామర్స్లో 22,328, ఫిజికల్ సైన్స్లో 12,211 మంది, లైఫ్ సైన్స్ 10,435, ఆర్ట్స్ కోర్సుల్లో 8,979 మంది సీట్లు పొందారు. వీరంతా ఈనెల 8లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది మొత్తం 1.97 లక్షల మంది డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు పొందారని తెలిపారు.