News October 24, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు

image

AP: వక్ఫ్ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకించాలని ఆలిండియా ముస్లిం లా బోర్డు, పలు ముస్లిం సంఘాలు సీఎం చంద్రబాబుని కోరాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎంని కలిసి వినతిపత్రం అందించాయి. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. 2026 మార్చి కన్నా ముందే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.

Similar News

News November 21, 2025

ఇంటలెక్చువల్ టెర్రరిస్టులు మరింత ప్రమాదం: ఢిల్లీ పోలీసులు

image

టెర్రరిస్టుల కంటే వారిని నడిపిస్తున్న ఇంటలెక్చువల్స్ మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ASG రాజు చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ట్రెండ్‌గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10 రెడ్‌ఫోర్ట్ పేలుళ్లే ఉదాహరణలని గుర్తుచేశారు. విచారణ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ నిందితులు బెయిల్ కోరుతున్నారన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ASG వాదనలు వినిపించారు.

News November 21, 2025

23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

image

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్‌మెంట్ ఇప్పటికే పూర్తయింది.

News November 20, 2025

ఎగుమతులకు రష్యా చమురు కొనుగోలు చేయం: రిలయన్స్

image

రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేస్తామని రిలయన్స్ వెల్లడించింది. ఎగుమతులకు ఉపయోగించే చమురు కొనుగోళ్లను నేటి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేయనున్నట్టు తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు.