News April 25, 2024
కర్ణాటకలో ముస్లింలూ ఓబీసీలే: NCBC

కర్ణాటకలో ముస్లింలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో భాగం కావడాన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వార్డ్ క్లాసెస్ (NCBC) తప్పుపట్టింది. ‘ముస్లింలు ఓబీసీ పరిధిలోకి వస్తారని కర్ణాటక ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 17 ముస్లిం వర్గాలు కేటగిరీ-1, మరో 19 ముస్లిం వర్గాలు కేటగిరీ-2A పరిధిలోకి వస్తాయి. ముస్లిం వర్గాల్లో నిరుపేదలు ఉన్నా ఆ మతం మొత్తాన్ని వెనుకబడిన వర్గంగా పరిగణించడం సరికాదు’ అని పేర్కొంది.
Similar News
News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.
News November 19, 2025
లక్కీ డిప్కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<


