News November 2, 2024

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్‌కు బదిలీ

image

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Similar News

News November 25, 2025

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్: సుందర్

image

గువాహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమేనని భారత ఆల్‌రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్‌లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్‌కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్‌లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.

News November 25, 2025

మంచి జరగబోతోంది: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్‌లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

News November 25, 2025

UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

image

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్‌గా మారింది.