News November 2, 2024
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్కు బదిలీ

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
Similar News
News January 6, 2026
అసలు ఈ ‘కార్తీక దీపం’ వివాదం ఏంటంటే?

TN తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్య ఆలయంలో భక్తులు కొండ కిందనున్న మండపం వద్ద దీపారాధన చేస్తారు. కానీ కొండపైన <<18776962>>దీపం వెలిగించాలని<<>> ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. కొండపై దర్గా ఉండటంతో దీనిపై 1920ల నుంచి వివాదాలున్నాయి. 1994లో ఓ భక్తుడు కోర్టుకెళ్లగా 1996లో మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఆ ఆర్డర్నే ప్రభుత్వం ఇన్నాళ్లు ఆధారంగా చూపింది. ఇటీవల సింగిల్ జడ్జి అనుమతిస్తే దానిని సవాలు చేసిన విషయం తెలిసిందే.
News January 6, 2026
అమ్మ కోసం ఉద్యోగాన్నే మానేసింది

కొందరు మేనేజర్లు ఎంత దారుణంగా ఉంటారో చెప్పే ఘటన ఒకటి SMలో వైరలవుతోంది. ఓ బ్యాంకులో కొన్నేళ్లుగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తల్లికి ఆరోగ్యం పాడైంది. కొన్నిరోజులు హాస్పిటల్లో ఉంచాలని సెలవులడిగారు. అందుకు మేనేజర్ ‘ఆమె కోలుకోకపోతే షెల్టర్లో ఉంచి జాబ్కి రా’ అని ఆదేశించారు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఆఖరికి జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసింది గానీ తన తల్లిని మాత్రం దూరం చేసుకోలేదు.
News January 6, 2026
అతిగా దుస్తులు కొంటున్నారా?

‘ఫాస్ట్ ఫ్యాషన్’ పేరుతో మనం కొంటున్న దుస్తులు పర్యావరణానికి శాపంగా మారుతున్నాయి. ఏటా వెలువడుతున్న క్లాతింగ్ వేస్ట్ సముద్రాలను, నేలను విషతుల్యం చేస్తున్నాయి. మనం ధరించే ఒక్క జత బట్టల తయారీకి ఎన్నో లీటర్ల నీరు ఖర్చవుతుంది. అందుకే అవసరముంటేనే దుస్తులు కొనండి. ఉన్నవాటిని ఎక్కువ కాలం వాడండి. ఫ్యాషన్ కోసం ప్రకృతిని కలుషితం చేయకండి. బాధ్యతగా బట్టలు కొందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం. SHARE IT


