News August 18, 2024

ఎన్నిక‌ల‌పై MVA వ్యూహాలు

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విప‌క్ష మ‌హావికాస్ అఘాడీలోని మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య సీట్ల పంప‌కాల‌కు ఉమ్మ‌డి స‌ర్వే నిర్వ‌హిద్దామ‌ని కాంగ్రెస్ ప్ర‌తిపాదించింది. అయితే ఎన్నికల తర్వాత ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి CM పదవి ఇచ్చే ఫార్ములాను విర‌మించుకోవాల‌ని శివ‌సేన UBT చీఫ్‌ ఉద్ధవ్ కోరుతున్నారు. ఈ ఫార్ములా వ‌ల్ల‌ ప్రతి పార్టీ తమకు గరిష్ఠ సంఖ్యలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తాయని వాదిస్తున్నారు.

Similar News

News January 5, 2026

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: పార్థసారథి

image

AP: రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. సోలార్, విండ్, బయో విద్యుత్ రంగాల్లో 80గిగావాట్ల విద్యుత్‌ను తక్కువ ధరకు కొనే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు కంప్లీట్ సబ్సిడీ.. బీసీలకు అదనంగా రూ.50వేల రాయితీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.

News January 5, 2026

శివ మానస పూజ ఎలా చేయాలి?

image

శివ మానస పూజ అంటే ఏ పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుడిని ఆరాధించడం. అందుకోసం ప్రశాంతమైన చోట కూర్చుని కళ్లు మూసుకోవాలి. హృదయమే రత్న సింహాసనమని, ఆత్మయే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలంతో అభిషేకం, కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివుడికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తిమంతమైనది. భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజను ఆచరించవచ్చు.

News January 5, 2026

కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం ఎక్కువే..

image

కాండం తొలిచే పురుగు వరి నారుమడి నుంచి పంట ఈనె దశ వరకు ఆశించి నష్టం కలిగిస్తుంది. నారుమడి దశలో ఈ పురుగు మొక్క మువ్వలోకి రంద్రాలు చేసుకొని చొచ్చుకెళ్లి తినడం వల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి మెలికలు తిరిగి ఎండి, మొక్కలు అధికంగా చనిపోతాయి. కాండం భాగాన్ని ఈ పురుగు తింటే మొక్కకు సరిపడ పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి. కాండం తొలుచు పురుగు పంట నాణ్యత, దిగుబడిని ప్రభావితం చేస్తుంది.