News June 22, 2024

KCRను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం: ఎర్రబెల్లి

image

TG: తాను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో BRS ఓడినందుకు బాధగా ఉందని, KCRను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పారు. తాను నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ పరిస్థితిపై రివ్యూ చేస్తున్నా.. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News December 13, 2025

బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. J&Jకు రూ.360 కోట్ల షాక్!

image

బేబీ పౌడర్ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ కంపెనీ పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు $40M(రూ.360 కోట్లు) చెల్లించాలంటూ కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. నాలుగు దశాబ్దాలుగా పౌడర్ వాడటంతో క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీపై 67 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

News December 13, 2025

కుటుంబంలో ఎవరైనా మరణిస్తే తెలుపు దుస్తులు ఎందుకు?

image

కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో తెలుపు దుస్తులు ధరిస్తారు. అయితే ఈ రంగు శాంతి, స్వచ్ఛత, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. దుఃఖ సమయంలో తెల్ల దుస్తులు ధరిస్తే.. కుటుంబ సభ్యుల మనస్సుకు ప్రశాంతత లభిస్తుందట. అలాగే తెలుపు సత్యం, సద్భావనలకు చిహ్నం. మరణించిన ఆత్మ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది కాబట్టి, ఆత్మకు శాంతి చేకూరడానికి, ప్రశాంత వాతావరణం కోసం ఈ తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు.

News December 13, 2025

ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా చక్రవర్తి

image

భారతదేశ చరిత్రలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళా సామ్రాజ్ఞి రజియా సుల్తానా. క్రీ.శ 1236- 1240 వరకు నాలుగేళ్ల పాటు ఢిల్లీ గద్దెపై కూర్చొని సుమారు సగం భారతదేశాన్ని పరిపాలించారు. సెల్జుక్‌ వంశానికి చెందిన రజియా అటు టర్కిష్‌ చరిత్రలోనూ ఇటు ముస్లిం చరిత్రలోనూ ప్రథమ మహిళా చక్రవర్తిగా పేరుగాంచారు. అప్పటి పురుషాధిక్య సమాజంలో అవరోధాలన్నీ ఎదుర్కొన్న ఆ ధీరోదాత్తను మాత్రం చరిత్ర మర్చిపోయింది.