News July 13, 2024
కేసీఆర్ను జైలుకు పంపడమే నా లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను జైలుకు పంపడమే తన లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన్ను గద్దె దించాలన్న ఓ లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని మీడియా సమావేశంలో తెలిపారు. ‘మిగులు బడ్జెట్తో మొదలైన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారు. ప్రతీ శాఖను అవినీతిమయం చేశారు. అందుకే బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ సమాధైనట్లే’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 28, 2025
KNR: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి రెగ్యులర్, 6 నుండి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో దరఖాస్తుకు గాను జనవరి 21 వరకు అవకాశం ఉండగా, పరీక్ష ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు. ఆధార్ కార్డు, ప్రస్తుతం చదువుతున్న తరగతి బోనఫైడ్, కులం, ఆదాయం, ఫోటో, సంతకం తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
News December 28, 2025
KNR: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి రెగ్యులర్, 6 నుండి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో దరఖాస్తుకు గాను జనవరి 21 వరకు అవకాశం ఉండగా, పరీక్ష ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు. ఆధార్ కార్డు, ప్రస్తుతం చదువుతున్న తరగతి బోనఫైడ్, కులం, ఆదాయం, ఫోటో, సంతకం తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
News December 28, 2025
2 రోజుల్లో ముగిసిన టెస్టు.. రూ.60 కోట్ల నష్టం?

యాషెస్ సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియాకు నష్టాలను తెచ్చిపెడుతోంది. మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు రెండు రోజుల్లో <<18683393>>ముగియడమే<<>> దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీంతో భారీగా బిజినెస్ కోల్పోయి, దాదాపు రూ.60 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. అంతకుముందు రెండో టెస్టు(పెర్త్) సైతం 2 రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. చివరి టెస్టు సిడ్నీ వేదికగా JAN 4న మొదలు కానుంది.


