News July 13, 2024
కేసీఆర్ను జైలుకు పంపడమే నా లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను జైలుకు పంపడమే తన లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన్ను గద్దె దించాలన్న ఓ లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని మీడియా సమావేశంలో తెలిపారు. ‘మిగులు బడ్జెట్తో మొదలైన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారు. ప్రతీ శాఖను అవినీతిమయం చేశారు. అందుకే బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ సమాధైనట్లే’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 14, 2025
పుష్పగిరిలో వామన నరసింహ వరాహ స్వాముల కుడ్య శిల్పం

వల్లూరులోని పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై నిల్చున్న వామన నర్సింహ వరాహ స్వాముల కుడ్య శిల్పం విచిత్రంగా అద్భుతంగా ఉందని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. విష్ణుమూర్తి ధర్మ పరిరక్షణ కోసం చేసిన పది దశావతారాలలో మూడు అవతారాలను చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రదేశాలలో రాతిపై చెక్కడం కష్టమన్నారు.
News December 14, 2025
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక..

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిన్నగోని కాటంరాజు అనే వ్యక్తి BRS మద్దతుతో తొలి విడతలో మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ సర్పంచ్గా పోటీ చేశారు. తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉన్నప్పటికీ 251 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డిప్రెషన్కు గురైన ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
News December 14, 2025
100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు: TTD

AP: దేశంలో తొలిసారిగా ఆధ్యాత్మికత, పర్యావరణ పెంపు లక్ష్యంతో 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ‘హిందూ ఆలయాల్లో ధ్వజ స్తంభాలకు అవసరమైన టేకు, ఏగిశ, కినో, టెర్మినేలియా, షోరియా జాతి వృక్షాలు ఇందులో ఉంటాయి. దేశవ్యాప్తంగా TTD ఆధ్వర్యంలో ప్రస్తుతం 60 ఆలయాలున్నాయి. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లో మరిన్ని ఆలయాలు నిర్మించనున్నాం’ అని తెలిపారు.


