News March 20, 2025

ఈ అవార్డుతో నా హృదయం ఉప్పొంగింది: చిరు

image

UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో పార్లమెంట్ సభ్యులు, మంత్రుల నుంచి అవార్డు అందుకోవడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మరింత శక్తితో నా పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. నా ప్రయాణంలో తోడున్న, నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

పేరుపాలెం బీచ్ లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల మోహన్ సాయి గణేశ్ (19) మిత్రులతో కలిసి అలల్లో స్నానం చేస్తూ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అధికారులు నిన్నటి నుంచి గాలిస్తుండగా సోమవారం మోళ్లపర్రులో బీచ్‌లో లభ్యమైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.